శ్రీసాయిసచ్చరిత్రము
ఏడవ అధ్యాయము
అద్భుతావతారము; సాయిబాబా వైఖరి; వారి యోగాభ్యాసము; వారి సర్యాంతర్యామిత్వము;
కుష్ఠుభక్తుని సేవ; ఖాపర్డే కుమారుని ప్లేగు; పండరిపురము పోవుట.
అద్భుతావతారము
సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడనుకొన్నచో హిందూమతాచారసంపన్నుడుగ గాన్పించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా యన్న విషయము ఇదమిద్ధముగ యెవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి యుత్సవముజరుపుచుండెను. అదేకాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ యుత్సవ సమయమందు కుస్తీపోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచినవారికి మంచి బహుమతులిచ్చెడివారు. గోకులాష్టమినాడు గోపాల్కాలోత్సవము జరిపించుచుండిరి. ఈదుల్ఫితర్ పండుగనాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహఱ్ఱం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిల్పి, కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామములో నూరేగించెదమనిరి. నాలుగు దినములవరకు మసీదులో తాబుతు నుంచుటకు బాబా సమ్మతించి యయిదవనాడు నిస్సంకోచముగ దానిని తామే తీసి వేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకువలె వాది చెవులు కుట్టబడియుండెను. వారు హిందువులన్నచో, సున్తీ ని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదునందేల యుండును? మహమ్మదీయుడైనచో ధునియను అగ్నిహొత్రమునేల వెలిగించి యుండువారు? అదియేగాక, తిరుగలితో విసరుట, శంఖమూదుట, గంటవాయించుట,హొమము చేయుట, భజన, అన్నసంతర్పణ, ఆర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయమతమునకు అంగీకారముకాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచారపరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కాము లెట్లూ చేయుచుండేడివారు? వారే తెగవారని యడుగబోయిన వారెల్లరు వారిని సందర్శించిన వేంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది యొక వింతకాదు. ఎవరయితే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్యశరణాగతి యొనరించెదరో వారు దేవునితో నైక్యమై పోయెదరు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధములేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గాన్పించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజనపళ్లెముళో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కాదు. శ్రీసాయి యవతారుము విశిష్టమైనది; యద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదములచెంత కూర్చొను భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా యదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన యానందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగ వర్ణించలేను. ఎవరు వారి పాదములను వమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులనేకమంది సాయిబాబావద్దకు వచ్చెడివారు. బాబా వారితో కలసి నవ్వుచూ, సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ, వారి నాలుకపై 'అల్లామాలిక్' యను మాట యెప్పుడూ నాట్యమాడుచుండెడిది. వరికి వాదవివాదములు గాని, చర్చలుగాని యిష్టము లేదు. అప్పుడప్పుడు కోపము పహించినప్పటికి, వారెల్లప్పుడు శాంతముగాను, సంయమముతోను యుండెడివారు. ఎల్లప్పుడు పరిపూర్ణ వేదాంతతత్త్వమును భోధించుచుండువారు. ఆఖరివరకు బాబా యెవరో ఎవరికి తెలయనేలేదు. వారు ప్రభువులను భిక్షుకులను నొకే రీతిగా అదరించిరి. అందరి యంతరంగములందు గల రహస్యములన్ని బాబా యెరింగెడివారు. బాబా ఆ రహస్యములను వేలిబుచ్చగనే యందరు ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులయినప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికేమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవదేహముతో సంచరించుచున్నప్పటికీ, వారి చర్యలను బట్టి జూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని జూచిన వారందరు వారు శిరిడిలో వెలగిన భగవంతుడనియే యనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమల నెట్లు వర్ణించగలను?
సాయిబాబా వైఖరి
శిరిడీ గ్రామములో నున్న శని, గణపతి, పార్వతీ - శంకర, గ్రామదేవత, మారుతీ మొదలగు దేవాలయములన్నిటిని తాత్యాపాటీలు ద్వారా బాబా మరమ్మతు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణరూపముగా వసూలయిన పైకమునంతయు నొక్కొక్కరికి రోజుకొక్కంటిని రూ.50/ -, 20/ -,15/ - ల చొప్పున ఇచ్ఛవచ్చినట్లు పంచిపెట్టెడివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతు లగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్ఠువారు కూడ రోగవిముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరచుండెను. ఎటువంటి మందులు పసరులతో పనిలేకుండనే గ్రూడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెని. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరును కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలల వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు శిరిడీకి తండోపతండములుగ రాసాగిరి. బాబా ఎల్లప్పుడు ధునికెదురుగా ధ్యానమగ్నులయి కూర్చొనెడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్రవిసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానముచేసేవారు; మరొక్కప్పుడు స్నానము లేకుండానే యుండేవారు. తొలిదినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షిమ్చి ఔషధము లిచ్చెడివారు. వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతముగ పని చేయుచుండెడివి. వారు గొప్ప 'హకీం '(వైద్యుడు) యని పేరు వచ్చెను. ఈ సందర్భమున నొక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి యెఱ్ఱబడెను. శిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతరభక్తు లాతనిని బాబా వద్దకు గొనిపోయిరి. సామాన్యముగ అట్టి రోగులకు అంజనములు,ఆవుపాలు, కర్పూరముతో చేసిన యౌషధములు వైద్యులుపయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడిగింజలను నూరి రెండు మాత్రలుగ జేసి, యొక్కొక్క కంటిలో నొక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మదుసటి దినము ఆకట్లను విప్పి నీళ్ళను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టిననూ సున్నితమైన కండ్లు మండనేలేదు ఆటువంటి చిత్రములనేకములు గలవు. కాని, యందు యిదొకటి మాత్రమే చెప్పబడినది.
బాబా యోగాభ్యాసములు
సాయిబాబాకు సకలయోగప్రక్రియలు తెలిసియుండెను. ధౌతి, ఖండయోగము, సమాధి, మున్నగు షడ్విధయోగప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో రెండు మాత్రమే యిక్కడ వర్ణింపబడినవి.
1.ధౌతి
మసీదుకు చాల దూరమున ఒక మఱ్ఱిచెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి మూడురోజులకొకసారి బాబా యచ్చట్కు పోయి ముఖప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆసవయములో బాబా తన ప్రేవులను బయటికి వెడల గ్రక్కి, వాటిని నేటితో శుభ్రపరచి, ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట శిరిడీలోని కొందరు కండ్లార చూచి చెప్పిరి. మామూలుగ ధౌతియనగా 3 అంగుళముల వెడల్పు 22 1/2 అడుగుల పోడవుగల గుడ్డను మ్రింగి కడుపులో అరగంటవరకు నుండనిచ్చి పమ్మట తీసెదరు, కాని బాబా చేసిన ధౌతి చాల విశిష్టము, అసాధారణమునైనది.
2.ఖండయోగము
బాబా తన శరీరావయవములన్నియు వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచి పెట్టువారు. ఒకనాడొక పెద్దమనిషి మసీదుకు పోయి బాబా యవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూని చేసిరనుకొని గ్రామ మునసబు పద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యారు చేసినవానికి ఆ విషయము గూర్చి కొంచెమైన తెలిసి యుండునని తననే అనుమానించెదరని భయపడి యూరకొనెను. మరుసటిదినమతడు మసీదుకు పోగా, బాబా యెప్పటివలె హాయిగా కూర్చొనియుండుట జూచి యాశ్చర్యపడెను. ముందుదినము తాను చూచిన దంతయు భ్రాంతియనుకొనెను. చిరుప్రాయమునుండి బాబా వివిధ యోగప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి యెవ్వరికిని అంతుబట్టనిది. రోగులవద్దనుంచి డబ్బు పుచ్చుకొనక యుచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు వ్యధార్ధులు వారి యనుగ్రహమువల్ల స్వస్థత పొందిరి. నిస్వార్ధముగ వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్పకీర్తి వచ్చెను. బాబా తమ సొంతముకొరకు ఏమియు చేయక, యితరుల మేలుకొరకే యెల్లప్పుడు పాటుపడేవారు. ఒక్కొక్కడు ఇతరుల వ్యాధిని తమపైవేసికొని ఆ భాధను తామనుభనించేవారు. అటువంటి సంఘటననొకదానిని యీ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్యజ్ఞత, దయార్ధ్రహృదయము విదితమగును.
బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము
1910వ సంవత్సరుము (ఘనత్రయోదశి నాడు, యనగా) దీపావళి పండుగ ముందురోజున బాబా ధునివద్ద కూర్చుండి చలికాచుకొనుచు, ధునిలో కట్టెలు వేయుచుండెను. కొంతసేపయిన తరువాత హఠాత్తుగ కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్తి, నిశ్చలముగ యుండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండేయు దీనిని జూచి, వెంటనే బాబా వైపుకు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగ వెనుకకు లాగెను. "దేవా! ఇట్లేల చేసితిర" ని బాబా నడగిరి. (మరేదోలోకములో యుండినట్లుండిన) బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని, "ఇక్కడకు చాలదూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని, కొలిమినూదుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. వెంటనే నాచేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. మాచేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నాకానందము గలుగచేయుచున్న" దని జవాబిచ్చెను
కుష్ఠురోగభక్తుని సేవ
బాబా చెయ్యి కాలెనను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలిసికొనిన నానా సాహెబు చాందోర్కరు వెంటనే బొంబాయినుండి డాక్టరు పరమనంద్ యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకొని వైద్యసామగ్రితో సహా హుటాహుటిన శిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా యందుల కొప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీశిందే యను కుష్ఠురోగి యేదో ఆకువేసి కట్టు కట్టెడివాడు నానా యెంతవేడినను బాబా డాక్టగుగారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టరుగారు కూడ అనేకసారులు వేడుకొనిరి. 'అల్లాయే తన వైద్యుడనీ' ,'తమకేమాత్రము బాధలేదనీ', చెప్పుచు, యెటులో డాక్టరుచే చికిత్సచేయించుకొనుటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూతయైన తెరువకుండగనే బొంబాయి తిరిగి వెళ్లిపోయెను. కాని అతనికి యీ మిషతో బాబా దర్శనభాగ్యము లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టు కట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయము మానిపోయను. అందరు సంతోషించిరి. అప్పటికి యింకా ఏమైన నొప్పి మిగిలియుండినదాయను సంగతి యెవరికి తెలియదు. కాని, ప్రతిరోజు ఉదయము భాగోజీ పట్టీలను విప్పి, బాబా చేతిని నేతితో తోమి, తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. మహాసిద్ధపురుషుడయిన బాబాకిదంతయు నిజానికి అవసరములేనప్పటికీ, తన భక్తుడైన భాగోజీ యందు గల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండీకి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధునియొద్ద కూర్చొనగనే, భాగోజీ తన సేవాకర్యము మొదలిడువాడు. బాగోజీ గతజన్మయందు చేసిన పాపఫలితముగ యీ జన్మమున కుష్ఠురోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు, దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతునివలె గాన్పించు నప్పటికి, అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివడు; బాబా సహవాసమును పూర్తిగా ననుభవించినవాడు.
ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి
బాబా విచిత్రలీలలలో నింకొకదానిని వర్ణించెదను. అమరావతి నివాసి యగు దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి శిరిడిలో కొన్ని దినములుండెను. ఒకనాడు ఖాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. శిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బూటీవాడా వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయెను. గద్గదకంఠముతో తన చిన్నకొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా యామెతో దయతో మృదువుగ నిట్లెనెను: "ప్రస్తుతము ఆకాశము మబ్బుపట్టియున్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నియు చెదిరిపోయి, ఆకాశము నిర్మలమగును " అట్లనుచు బాబా కఫ్నీని పై కెత్తి, చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణముగల నాలుగు ప్లేగు పొక్కులను చూపుచూ, "నా భక్తులకొరకు నే నెట్లు బాధపడెదనో చూడుము! వారి కష్టములన్నియు నావే!" ఈ మహాద్బుతలీలను జూచిన జనులకు, మహాత్ములు తమ భక్తుల బాధలు తామే యెట్లుస్వీకరింతురో యను విషయము స్పష్టమయ్యెను. మహాత్ముల మనస్సు మైనముకన్న మెత్తనిది, వెన్నవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియు ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగ భావించెదరు.
బాబా పండరి ప్రయాణము!
సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరముల నెట్లు గ్రహించుచుండెనో యను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని నందూరుబారులో మామల్తదారుగా నుండెను. అతనికి పండరీపురుమునకు బదిలీ అయ్యెను. సాయిబాబాయందు అతనికిగల భక్తి యను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోకవైకుంఠ మనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గోప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి యుండెను. శిరిడీలో యెవ్వరికి ఉత్తరము వ్రాయన, హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను. ముందుగా శిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి, ఆ తరువాత పండరికి పోవలెననుకొనెను. నానాసాహెబు శిరిడీకి వచ్చు సంగతి యెవరికి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీమ్గాం చేరుసరికి శిరిడీ మసీదులో కలకలము రేగేను. బాబా మసీదులో కూర్చుండి మహాల్సాపతి, అప్పాశిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో నిట్లనియెను: "మన నలుగురము కలిసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరచినారు. కనుక ఆనందముగా పాడెదము లెండు!" అందరు కలిసి పాడదొడంగిరి. ఆపాట యొక్క భావమేమన,"నేను పండరి పోవలెను. నేనక్కడనే నివసించవలెను. ఎందుకనగా, అదియే నా ప్రభువు యొక్క ధామము."
అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరు బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబసమేతముగ వచ్చి బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసి, తనకు పండరీపురము బదలీయైనదనీ, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి యక్కడుండవలసినదనీ వేడుకొనెను. అటుల బ్రతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా యప్పటికే పండరి పోవలెను, అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది, నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు!
సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడనుకొన్నచో హిందూమతాచారసంపన్నుడుగ గాన్పించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా యన్న విషయము ఇదమిద్ధముగ యెవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి యుత్సవముజరుపుచుండెను. అదేకాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ యుత్సవ సమయమందు కుస్తీపోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచినవారికి మంచి బహుమతులిచ్చెడివారు. గోకులాష్టమినాడు గోపాల్కాలోత్సవము జరిపించుచుండిరి. ఈదుల్ఫితర్ పండుగనాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహఱ్ఱం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిల్పి, కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామములో నూరేగించెదమనిరి. నాలుగు దినములవరకు మసీదులో తాబుతు నుంచుటకు బాబా సమ్మతించి యయిదవనాడు నిస్సంకోచముగ దానిని తామే తీసి వేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకువలె వాది చెవులు కుట్టబడియుండెను. వారు హిందువులన్నచో, సున్తీ ని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదునందేల యుండును? మహమ్మదీయుడైనచో ధునియను అగ్నిహొత్రమునేల వెలిగించి యుండువారు? అదియేగాక, తిరుగలితో విసరుట, శంఖమూదుట, గంటవాయించుట,హొమము చేయుట, భజన, అన్నసంతర్పణ, ఆర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయమతమునకు అంగీకారముకాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచారపరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కాము లెట్లూ చేయుచుండేడివారు? వారే తెగవారని యడుగబోయిన వారెల్లరు వారిని సందర్శించిన వేంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది యొక వింతకాదు. ఎవరయితే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్యశరణాగతి యొనరించెదరో వారు దేవునితో నైక్యమై పోయెదరు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధములేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గాన్పించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజనపళ్లెముళో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కాదు. శ్రీసాయి యవతారుము విశిష్టమైనది; యద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదములచెంత కూర్చొను భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా యదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన యానందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగ వర్ణించలేను. ఎవరు వారి పాదములను వమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులనేకమంది సాయిబాబావద్దకు వచ్చెడివారు. బాబా వారితో కలసి నవ్వుచూ, సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ, వారి నాలుకపై 'అల్లామాలిక్' యను మాట యెప్పుడూ నాట్యమాడుచుండెడిది. వరికి వాదవివాదములు గాని, చర్చలుగాని యిష్టము లేదు. అప్పుడప్పుడు కోపము పహించినప్పటికి, వారెల్లప్పుడు శాంతముగాను, సంయమముతోను యుండెడివారు. ఎల్లప్పుడు పరిపూర్ణ వేదాంతతత్త్వమును భోధించుచుండువారు. ఆఖరివరకు బాబా యెవరో ఎవరికి తెలయనేలేదు. వారు ప్రభువులను భిక్షుకులను నొకే రీతిగా అదరించిరి. అందరి యంతరంగములందు గల రహస్యములన్ని బాబా యెరింగెడివారు. బాబా ఆ రహస్యములను వేలిబుచ్చగనే యందరు ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులయినప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికేమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవదేహముతో సంచరించుచున్నప్పటికీ, వారి చర్యలను బట్టి జూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని జూచిన వారందరు వారు శిరిడిలో వెలగిన భగవంతుడనియే యనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమల నెట్లు వర్ణించగలను?
సాయిబాబా వైఖరి
శిరిడీ గ్రామములో నున్న శని, గణపతి, పార్వతీ - శంకర, గ్రామదేవత, మారుతీ మొదలగు దేవాలయములన్నిటిని తాత్యాపాటీలు ద్వారా బాబా మరమ్మతు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణరూపముగా వసూలయిన పైకమునంతయు నొక్కొక్కరికి రోజుకొక్కంటిని రూ.50/ -, 20/ -,15/ - ల చొప్పున ఇచ్ఛవచ్చినట్లు పంచిపెట్టెడివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతు లగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్ఠువారు కూడ రోగవిముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరచుండెను. ఎటువంటి మందులు పసరులతో పనిలేకుండనే గ్రూడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెని. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరును కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలల వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు శిరిడీకి తండోపతండములుగ రాసాగిరి. బాబా ఎల్లప్పుడు ధునికెదురుగా ధ్యానమగ్నులయి కూర్చొనెడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్రవిసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానముచేసేవారు; మరొక్కప్పుడు స్నానము లేకుండానే యుండేవారు. తొలిదినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షిమ్చి ఔషధము లిచ్చెడివారు. వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతముగ పని చేయుచుండెడివి. వారు గొప్ప 'హకీం '(వైద్యుడు) యని పేరు వచ్చెను. ఈ సందర్భమున నొక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి యెఱ్ఱబడెను. శిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతరభక్తు లాతనిని బాబా వద్దకు గొనిపోయిరి. సామాన్యముగ అట్టి రోగులకు అంజనములు,ఆవుపాలు, కర్పూరముతో చేసిన యౌషధములు వైద్యులుపయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడిగింజలను నూరి రెండు మాత్రలుగ జేసి, యొక్కొక్క కంటిలో నొక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మదుసటి దినము ఆకట్లను విప్పి నీళ్ళను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టిననూ సున్నితమైన కండ్లు మండనేలేదు ఆటువంటి చిత్రములనేకములు గలవు. కాని, యందు యిదొకటి మాత్రమే చెప్పబడినది.
బాబా యోగాభ్యాసములు
సాయిబాబాకు సకలయోగప్రక్రియలు తెలిసియుండెను. ధౌతి, ఖండయోగము, సమాధి, మున్నగు షడ్విధయోగప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో రెండు మాత్రమే యిక్కడ వర్ణింపబడినవి.
1.ధౌతి
మసీదుకు చాల దూరమున ఒక మఱ్ఱిచెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి మూడురోజులకొకసారి బాబా యచ్చట్కు పోయి ముఖప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆసవయములో బాబా తన ప్రేవులను బయటికి వెడల గ్రక్కి, వాటిని నేటితో శుభ్రపరచి, ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట శిరిడీలోని కొందరు కండ్లార చూచి చెప్పిరి. మామూలుగ ధౌతియనగా 3 అంగుళముల వెడల్పు 22 1/2 అడుగుల పోడవుగల గుడ్డను మ్రింగి కడుపులో అరగంటవరకు నుండనిచ్చి పమ్మట తీసెదరు, కాని బాబా చేసిన ధౌతి చాల విశిష్టము, అసాధారణమునైనది.
2.ఖండయోగము
బాబా తన శరీరావయవములన్నియు వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచి పెట్టువారు. ఒకనాడొక పెద్దమనిషి మసీదుకు పోయి బాబా యవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూని చేసిరనుకొని గ్రామ మునసబు పద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యారు చేసినవానికి ఆ విషయము గూర్చి కొంచెమైన తెలిసి యుండునని తననే అనుమానించెదరని భయపడి యూరకొనెను. మరుసటిదినమతడు మసీదుకు పోగా, బాబా యెప్పటివలె హాయిగా కూర్చొనియుండుట జూచి యాశ్చర్యపడెను. ముందుదినము తాను చూచిన దంతయు భ్రాంతియనుకొనెను. చిరుప్రాయమునుండి బాబా వివిధ యోగప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి యెవ్వరికిని అంతుబట్టనిది. రోగులవద్దనుంచి డబ్బు పుచ్చుకొనక యుచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు వ్యధార్ధులు వారి యనుగ్రహమువల్ల స్వస్థత పొందిరి. నిస్వార్ధముగ వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్పకీర్తి వచ్చెను. బాబా తమ సొంతముకొరకు ఏమియు చేయక, యితరుల మేలుకొరకే యెల్లప్పుడు పాటుపడేవారు. ఒక్కొక్కడు ఇతరుల వ్యాధిని తమపైవేసికొని ఆ భాధను తామనుభనించేవారు. అటువంటి సంఘటననొకదానిని యీ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్యజ్ఞత, దయార్ధ్రహృదయము విదితమగును.
బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము
1910వ సంవత్సరుము (ఘనత్రయోదశి నాడు, యనగా) దీపావళి పండుగ ముందురోజున బాబా ధునివద్ద కూర్చుండి చలికాచుకొనుచు, ధునిలో కట్టెలు వేయుచుండెను. కొంతసేపయిన తరువాత హఠాత్తుగ కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్తి, నిశ్చలముగ యుండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండేయు దీనిని జూచి, వెంటనే బాబా వైపుకు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగ వెనుకకు లాగెను. "దేవా! ఇట్లేల చేసితిర" ని బాబా నడగిరి. (మరేదోలోకములో యుండినట్లుండిన) బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని, "ఇక్కడకు చాలదూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని, కొలిమినూదుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. వెంటనే నాచేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. మాచేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నాకానందము గలుగచేయుచున్న" దని జవాబిచ్చెను
కుష్ఠురోగభక్తుని సేవ
బాబా చెయ్యి కాలెనను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలిసికొనిన నానా సాహెబు చాందోర్కరు వెంటనే బొంబాయినుండి డాక్టరు పరమనంద్ యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకొని వైద్యసామగ్రితో సహా హుటాహుటిన శిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా యందుల కొప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీశిందే యను కుష్ఠురోగి యేదో ఆకువేసి కట్టు కట్టెడివాడు నానా యెంతవేడినను బాబా డాక్టగుగారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టరుగారు కూడ అనేకసారులు వేడుకొనిరి. 'అల్లాయే తన వైద్యుడనీ' ,'తమకేమాత్రము బాధలేదనీ', చెప్పుచు, యెటులో డాక్టరుచే చికిత్సచేయించుకొనుటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూతయైన తెరువకుండగనే బొంబాయి తిరిగి వెళ్లిపోయెను. కాని అతనికి యీ మిషతో బాబా దర్శనభాగ్యము లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టు కట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయము మానిపోయను. అందరు సంతోషించిరి. అప్పటికి యింకా ఏమైన నొప్పి మిగిలియుండినదాయను సంగతి యెవరికి తెలియదు. కాని, ప్రతిరోజు ఉదయము భాగోజీ పట్టీలను విప్పి, బాబా చేతిని నేతితో తోమి, తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. మహాసిద్ధపురుషుడయిన బాబాకిదంతయు నిజానికి అవసరములేనప్పటికీ, తన భక్తుడైన భాగోజీ యందు గల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండీకి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధునియొద్ద కూర్చొనగనే, భాగోజీ తన సేవాకర్యము మొదలిడువాడు. బాగోజీ గతజన్మయందు చేసిన పాపఫలితముగ యీ జన్మమున కుష్ఠురోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు, దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతునివలె గాన్పించు నప్పటికి, అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివడు; బాబా సహవాసమును పూర్తిగా ననుభవించినవాడు.
ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి
బాబా విచిత్రలీలలలో నింకొకదానిని వర్ణించెదను. అమరావతి నివాసి యగు దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి శిరిడిలో కొన్ని దినములుండెను. ఒకనాడు ఖాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. శిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బూటీవాడా వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయెను. గద్గదకంఠముతో తన చిన్నకొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా యామెతో దయతో మృదువుగ నిట్లెనెను: "ప్రస్తుతము ఆకాశము మబ్బుపట్టియున్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నియు చెదిరిపోయి, ఆకాశము నిర్మలమగును " అట్లనుచు బాబా కఫ్నీని పై కెత్తి, చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణముగల నాలుగు ప్లేగు పొక్కులను చూపుచూ, "నా భక్తులకొరకు నే నెట్లు బాధపడెదనో చూడుము! వారి కష్టములన్నియు నావే!" ఈ మహాద్బుతలీలను జూచిన జనులకు, మహాత్ములు తమ భక్తుల బాధలు తామే యెట్లుస్వీకరింతురో యను విషయము స్పష్టమయ్యెను. మహాత్ముల మనస్సు మైనముకన్న మెత్తనిది, వెన్నవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియు ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగ భావించెదరు.
బాబా పండరి ప్రయాణము!
సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరముల నెట్లు గ్రహించుచుండెనో యను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని నందూరుబారులో మామల్తదారుగా నుండెను. అతనికి పండరీపురుమునకు బదిలీ అయ్యెను. సాయిబాబాయందు అతనికిగల భక్తి యను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోకవైకుంఠ మనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గోప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి యుండెను. శిరిడీలో యెవ్వరికి ఉత్తరము వ్రాయన, హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను. ముందుగా శిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి, ఆ తరువాత పండరికి పోవలెననుకొనెను. నానాసాహెబు శిరిడీకి వచ్చు సంగతి యెవరికి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీమ్గాం చేరుసరికి శిరిడీ మసీదులో కలకలము రేగేను. బాబా మసీదులో కూర్చుండి మహాల్సాపతి, అప్పాశిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో నిట్లనియెను: "మన నలుగురము కలిసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరచినారు. కనుక ఆనందముగా పాడెదము లెండు!" అందరు కలిసి పాడదొడంగిరి. ఆపాట యొక్క భావమేమన,"నేను పండరి పోవలెను. నేనక్కడనే నివసించవలెను. ఎందుకనగా, అదియే నా ప్రభువు యొక్క ధామము."
అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరు బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబసమేతముగ వచ్చి బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసి, తనకు పండరీపురము బదలీయైనదనీ, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి యక్కడుండవలసినదనీ వేడుకొనెను. అటుల బ్రతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా యప్పటికే పండరి పోవలెను, అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది, నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు!
ఏడవ అధ్యాయము
సంపూర్ణము
సంపూర్ణము
| సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు|
|శుభం భవతు |
|శుభం భవతు |
మొదటిరోజు పారాయణము సమాప్తము




