4, జూన్ 2009, గురువారం

మూడవ అధ్యాయము

శ్రీ సాయినాథాయ నమః
శ్రీసాయిసచ్చరిత్రము

మూడవ అధ్యాయము
సాయిబాబా యనుమతి - వాగ్ధానము; భక్తులకు బాబా నియమించిన పనులు;
బాబా కధలు సముద్రమధ్యమున దీపస్తంభములు;
బాబా ప్రేమ - రోహిలా కధ; అమృతతుల్యములైన బాబా పల్కులు.
సాయిబాబా యొక్క యనుమతియు, వాగ్ధానమును


వెనుకటి యధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీసాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి యనుమతినొసంగుచు ఇట్లు నుడివిరి: "సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవునిర్వర్తించుము. భయపడకుము. మనస్సు నిలకడగా నుంచుము. నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించి పోవును. శ్రద్ధాభక్తులతో వానిని వారికి ప్రపంచమందు వ్యామోహముక్షీణించును. బలమైన ప్రేమభక్తి కెరటములు లేచును. ఎవరయితే నా లీలలూ మునిగెదరో వారికిజ్ఞానరత్నములు లభించును."

ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగుననుధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండే(శ్యామా) వైపు తిరిగి బాబా యిట్లనెను:.

"ప్రేమతో నా నామమునుచ్ఛరించిన వారి కోరిక లన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారినన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా నాధారపడియున్నారో వారీ కధలువినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయువారికంతులేని యానందమునుశాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరయితే నన్ను శరణు వేడెదరో, భక్తివిశ్వాసములతో నన్నుపుజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో, వారినిదుఃఖబంధనములనుండి తప్పింతును. ప్రాపంచిక విషయములనన్నింటినీ మరచి, నా నామమునేజపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను, చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పుడు నన్నుజ్ఞప్తియందుంచుకొనువారు ప్రపంచవిషయములం దెట్లు తగులుకొందురు? వారిని మరణమునుండిబయటకు లాగెదను. నా కధలు వినినచో సకలరోగములు నివారింపబడును. కావున భక్తిశ్రద్ధలతో నా కధలనువినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తులయొక్కగర్వాహంకారములు నిష్కమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైననమ్మకము గలవారికి శుద్దచైతన్యముతో తాదాత్మ్యము కలుగును. 'సాయి సాయి' . యను నామమునుజ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున, చెడుపలుకుటవలన, వినుటవలన కలుగు పాపములుతొలగిపోవును."

భక్తులకు వేర్వేరు పనులు నియమించుట

భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాయములు, మఠములు, తీర్ధములలో నదివొడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నయమితు లగుదురు. భగవంతుని లీలలనుపాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్ధయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకునియమింపబడినది. విషయజ్ణానము శూన్యమగుటచే నీ పని నా అర్హతకు మించినది. అయినచో, యింతకఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవితచరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయియొక్క కరుణయే యింత కఠినకార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కాలముపట్టుకొనగనే సాయిబాబా నా యహంకారమును పరిహరించి, వారి కధలను వారే వ్రాసికొనిరి. కనుక గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందునుగాని నాకు గాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికిని శ్రుతిస్మృతి యను రెండు కండ్లు లేకుండుటచే సాయిసచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని . కాని భగవంతునిఅనుగ్రహము మూగవానిని మాట్లాడునట్లు చేయును; కుంటివానిని పర్వతము దాటునట్లు చేయును.తనయిచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము భగవంతునికే గలదు. హార్మోనియమునకుగానివేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియును. చంద్రకాంతము ద్రవించుట, సముద్రముప్పొంగుట వానివానివల్ల జరుగవు. అవి చంద్రోదయము వల్లజరుగును.

బాబా కథలు దీపస్తంభములు

సముద్రమధ్యమందు దీపస్తంభము లుండును. పడవలపై పోవువారు వెలుతురుతో రాళ్ళు రప్పలవల్లకలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమను మహాసముద్రములోబాబాకధలను దీపములు దారి చూపును. అవి అమృతముకంటే తియ్యగానుండి ప్రపంచయాత్ర చేయుమార్గమును సులభముగను, సుగమముగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మనచెవులద్వారా హృదయమందు ప్రవేశించునప్పుడు శరీరస్పృహయును,అహంకారమును, ద్వంద్వభావములును నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములుపటాపంచలయిపోవును. శరీరగర్వము మాయమై పోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయబడును. శ్రీసాయిబాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినగాని వినినగాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టియివియే మోక్షమునకు సులభసాధనములు కృతయుగములో శమదమములు (అనగా నశ్చలమనస్సు, శరీరము) త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలనునామములను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణములవారు చివరి సాధనమునుఅవలంచించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణముఅవలంభించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుట యతి సులభము. మనననస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్కథలను వినుటవలన పాడుటవలన మనకుదేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా జేసి, తుదకు ఆత్మసాక్షాత్కారముపొందునట్లు చేయును. కారణము చేతనే సాయిబాబా నాకు సులభముగా చదువగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను థ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననముచేసికొనవచ్చును. ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును. తుదకుప్రపంచమందు విరక్తిపొంది యాత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతము వ్రాయుట, తయారుచేయుట బాబాయొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడుగనే యుంటిని.

సాయిబాబా యొక్క మాతృప్రేమ

ఆవు తన దూడనెట్లు ప్రేమించునో యందరికి తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడు నిండియే.యుండును. దూడకు కావలసినప్పుడెల్ల కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లిగ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును, అలంకరించుటయందును తల్లితగిన శ్రద్ధ తీసికొని సరిగా చేయును. బిడ్డకు విషయమేమియు తెలియదుగాని, తల్లి తన బిడ్డలు చక్కగాదుస్తులు ధరించి యలంకరింపబడుట చూచి యమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చ దాగినదేదియు లేదు. అది యసామాన్యము; నిర్వ్యాజము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందుచూపుదురు. సాయిబాబాకు గూడా నాయందట్టి ప్రేమ యుండెను. దానికీ క్రింద యుదాహరణ మొకటి.
1916 సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగమునుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛనుకుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురుపౌర్ణమినాడు ఇతరభక్తులతో నేను కూడా శిరిడీకిపోయితిని. అన్నా చించణీకర్ నాగురించి బాబాతో నిట్లనెను; "దయచేసి యీ అన్నాసాహెబ్ యందుదాక్షిణ్యము చూపుము. వానికి వచ్చుపింఛను సరిపోదు, వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కింకేదైనఉద్యోగ మిప్పించుము. వాని యాతురతను తీసి, నిశ్చింతను గలుగచేయుము." అందులకు బాబా యిట్లుజవాబిచ్చెను: "వాని కింకొక ఉద్యోగమూ దొరుకును. కాని వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలెను. వానిభోజనపాత్రలు ఎప్పుడూ పూర్ణముగనే యుండును. అవి ఎన్నటికిని నిండుకొనవు. వాని దృష్టినంతటినినావైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరియెడల అణకువనమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందముపొందును.

నన్ను పూజింపుడనుదానిలోని 'నన్ను' అనగా ఎవరు? అను ప్రశ్నకు సమాధానము యీ గ్రంధముయొక్క ఉపోద్ఘాతములో 'సాయిబాబా ఎవరు' అనుశీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి యున్నది. చూడుడు!

రోహిలా కధ

రోహిలా కధ విన్నచో బాబా ప్రేమ యెట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కాతొడిగినవాడును, బలవంతుడునగు రోహిలా యొకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై శిరిడీలో స్థిరనివాసముఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురాను లోని కల్మాను చదువుచు, "అల్లాహు అక్బర్" యని యాబోతురంకెవేయునట్లు బిగ్గరగా నరచుచుండెను. అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి యింటికివచ్చిన శిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ళవరకు వారుదీనినోర్చుకొనిరి. తుదకు భాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిలా అరపుల నాపుమని బతిమాలిరి. బాబా వారిఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారిపనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిలా జోలికిపోవద్దని మదలించిరి. "రూహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు, ఆమె గయ్యాళి యనియు, ఆమెవచ్చి రోహిలను తనను బాధ పెట్టుచున్నదనియు, రోహిలా ప్రార్ధనలు విని ఆమె ఏమి చేయలేకఊరకయుండు" ననియు బాబా చెప్పెను. నిజముగా రోహిలకు భార్యయే లేదు. భార్యయనగా దుర్భుద్ధియనిబాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్ధనలయందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిలా తరపునవాదించి, ఊరిలోనివారి నోపికతో నోర్చుకొని అసౌకర్యమును సహింపవలసినదనియు, నది త్వరలోతగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను.

బాబా యొక్క యమృతతుల్యమగు పలుకులు

ఒకనాడు మధ్యాహ్న ఆరతి యయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడువారికి బాబా యీ క్రింది చక్కని యుపదేశమిచ్చిరి:"మీరెక్కడ నున్నాను, ఏమి చేయుచున్ననూ నాకుతెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించువాడను. అందరిహృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచరజీవకోటి నావరించియున్నాను. జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే, నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియచాలకుడను నేనే. సృష్టిస్థితిలయకారకుడను నేనే.ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారికేహానిగాని బాధగాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితరదృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే!"

చక్కని యమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో యే నౌకరీ కొరకు యత్నించక, గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకొంటిని. కాని, అణ్ణా చించణీకరు ప్రశ్నకు బాబా చెప్పినసమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా యని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగమూ దొరకెను. కాని అదికొద్దికాలము వరకే, అటుపిమ్మట వేరే పని యేదియు చేయక శ్రీసాయిసేవకు నా జీవితమంతయుసమర్పించితిని.

యధ్యాయమును ముగించబోవుముందు చదువరులకు నేను చెప్పునదేమన, బద్ధకము నిద్రచంచలమనస్సు దేహాభిమానము మొదలగు వానిని విడిచి, తమ యావత్తూ దృష్టిని సాయిబాబా కధలవైపుత్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురుగాక.
ఇతర మార్గము లవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరు నొకే మార్గమును త్రొక్కుదురు గాక! అనగా శ్ర్రీసాయి కధలను విందురు గాక! ఇది వారి యజ్ఞానమును నశింపజేయును. మోక్షమును సంపాదించిపెట్టును. లోభి యెక్కడ నున్నప్పటికిని వాని మనస్సు తను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు, బాబానుకూడా నెల్లరు తమ హృదయములందు స్ధాపించుకొందురుగాక!


మూడవ అధ్యాయము
సంపూర్ణము
| సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు |
|శుభం భవతు |

1 కామెంట్‌: